1
1
(రజని వాయిస్)
(మోత్కూరు )
సమాచార హక్కు చట్టం–2005 పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు ఈ చర్యలు అవసరమని ప్రతినిధులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం యాదాద్రి జిల్లా అధ్యక్షులు బీసు భాష, నోముల వెంకన్న, లోడి రవి కుమార్ పాల్గొన్నారు.